Tuesday, 28 July 2026 10:55:36 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: - సీఎం రేవంత్‌రెడ్డి

Date : 15 May 2026 11:13 PM Views : 102

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గాంధీ కుటుంబానికి దేశంపై విశ్వాసం ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర తనకు చాలా చొరవ ఉందని పేర్కొన్నారు. తన గీత తాను దాట‌నని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా సీఎం మాట్లాడారు. టీడీపీలో పదేళ్లు ప‌నిచేశాననిసీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికి తనను గౌర‌విస్తారని ప్రస్తావించారు. పార్టీని వ‌దిలిపెట్టిన త‌ర్వాత నాయ‌కుల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం చాలా అరుదని తెలిపారు. పార్టీని వ‌దిలిపెట్టే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌కు వెళ్లి చంద్ర‌బాబుకు చెప్పి వ‌చ్చానని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను దేశంలో అధికారంలోకి తేవాల‌ని రాహుల్ గాంధీ‌కి ల‌క్ష్యం ఉందని కాని ప్ర‌ధాని కావాల‌న్న ల‌క్ష్యం లేదని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ స‌మావేశంలో ప్ర‌ధాని ప‌ద‌వి తీసుకోవాల‌ని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని ప్రస్తావించారు. ఇప్పుడు జ‌నం స్విగ్గీ పాలిటిక్స్ కోరుకుంటున్నారని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి నుంచి ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముందు ప్ర‌క‌టించి త‌ర్వాత ఇండియా కూట‌మిని కూడా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ఒప్పిస్తామని తెలిపారు. ఇండియా కూట‌మి తరపున ఒక పాల‌సీ డాక్యూమెంటును తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల‌ను తీర్పు ఇవ్వ‌మ‌ని కోర‌తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2024 నుంచి 2034 వ‌ర‌కు కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2034 వ‌ర‌కు తాను తెలంగాణ‌లోనే ఉంటాననిఇక్కడి ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేస్తానని తెలిపారు. ప‌దిశాతం జీడీపీని తెలంగాణ దేశానికి ఇచ్చేలా ప‌నిచేస్తానని స్పష్టం చేశారు. 2034 వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రినని చెప్పుకొచ్చారు. 2034 త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌నని త‌ర్వాత త‌రానికి అవ‌కాశం ఇస్తానని తెలిపారు. దేశానికి కూడా సేవ‌లందిస్తా అని.. తన అనుభ‌వాన్ని దేశం కోసం పంచుతానని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేసిన తర్వాత.. ఆయ‌న ఏ బాధ్యతలు అప్పగించిన తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :