ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యువత చదువుతోపాటు క్రీడలలో ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని రంగాల్లో రాణించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం మండలం ధన్వాడలో డిపిఎల్-10 ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జిసిఏ టీం కప్పు గెలుచుకోగా హరీష్-11 టీం రన్నర్లుగా నిలువుగా శ్రీనుబాబు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, పట్టుదల, స్ఫూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయన్నారు. క్రీడా మైదానంలో చూపించే కృషి, క్రమశిక్షణ జీవితంలో విజయానికి దారి చూపిస్తాయన్నారు. సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో ముందుకు వచ్చిన యువతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా నడుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News