Monday, 02 March 2026 03:24:30 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

రాంప్ ద్వారా మహిళలకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణ మద్దతు...

అదనపు కలెక్టర్ (రెవెన్యూ)పి.చంద్రయ్య

Date : 25 February 2026 11:08 PM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాంప్ మహిళా త్వరణ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎం. ఎస్. ఎం. ఈ. లకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణం మద్దతును అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య లతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళ వ్యవస్థాపకులకు ఐ టి ఈ - సి విభాగం, వీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించినఅవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, భారత ఎంఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ మద్దతుతో రాంప్ ద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎంఎస్ఎమ్ఈ నిర్మాణాత్మక వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. 2 సంవత్సరాల ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార వృద్ధిని వేగవంతం చేసేందుకు, వారి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం అందిస్తుందని తెలిపారు. వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, తయారీ, హస్త కళలు, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలోని సంస్థలు, వ్యాపార నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి, వైవిధ్యేకరణ, బ్రాండింగ్, మార్కెట్ ఆక్సెస్, క్రెడిట్ లింకేజ్ లకు నిపుణుల మార్గదర్శకత్వంలో మద్దతు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసక్తి గల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం నాన్ ఫామ్ సారయ్య, వి హబ్ సంచాలకులు జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా, డా. సల్మాన్, అబిద్, శ్రీకర్,ఈ డి సి ప్రశాంత్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :