ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాంప్ మహిళా త్వరణ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎం. ఎస్. ఎం. ఈ. లకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణం మద్దతును అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య లతో కలిసి స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళ వ్యవస్థాపకులకు ఐ టి ఈ - సి విభాగం, వీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించినఅవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు, భారత ఎంఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ మద్దతుతో రాంప్ ద్వారా మహిళల నేతృత్వంలోని సంస్థలు, ఎంఎస్ఎమ్ఈ నిర్మాణాత్మక వ్యాపార రంగాలలో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. 2 సంవత్సరాల ఈ కార్యక్రమం ఎంపిక చేసిన మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార వృద్ధిని వేగవంతం చేసేందుకు, వారి ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం అందిస్తుందని తెలిపారు. వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, తయారీ, హస్త కళలు, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాలలోని సంస్థలు, వ్యాపార నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి, వైవిధ్యేకరణ, బ్రాండింగ్, మార్కెట్ ఆక్సెస్, క్రెడిట్ లింకేజ్ లకు నిపుణుల మార్గదర్శకత్వంలో మద్దతు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసక్తి గల వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం నాన్ ఫామ్ సారయ్య, వి హబ్ సంచాలకులు జాహిద్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఉహా, డా. సల్మాన్, అబిద్, శ్రీకర్,ఈ డి సి ప్రశాంత్ పాల్గొన్నారు.
Admin
E Nivas News