ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించే పథకం కింద దరఖాస్తు గడువును ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. గ్రామాల్లో వార్షిక ఆదాయం ₹1.50 లక్షలు, పట్టణాల్లో ₹2 లక్షలు మించని 18-55 ఏళ్ల మహిళలు అర్హులు. కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, వికలాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆధార్, రేషన్, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఫోటో, బ్యాంక్ పాస్బుక్ వివరాలతో( టీజీ. ఓబి ఎంఎంస్ ) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Admin
E Nivas News