ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లిందని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ ఘటన దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అలాగే, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని ఆయన అన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను అణచివేయకుండా, నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలుతీసుకోవాలని, దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Admin
E Nivas News