ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు ఆవరణంలో కాటారం డివిజన్ ఆదివాసి నాయక పోడ్ హక్కుల పరిరక్షణక మిటీ, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు గొట్టం భూమయ్య అధ్యక్షతన జిల్లాలో నాయక పోడ్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆదివాసి నాయక పోడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూన దయా నంద్ స్వామి, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్నలు మాట్లాడుతూ నాయక పోడు హక్కుల కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఆదివాసి ప్రజా ప్రతినిధులు తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. మన హక్కులను కాపాడుకుంటూ మనలను గుర్తించి గెలిపించిన ప్రజానీకానికి మంచి పనులు చేసి మన జాతికి మంచి పేరు తీసుకు రావాలన్నారు. మన జాతిలో ప్రజా ప్రతినిధులు ఎన్నిక కావడం శుభసూచకమని జ్ఞాపకంగా గొట్టం భూమయ్య అనే ఆదివాసి నాయకుడు తమ కుల గుర్తింపు కోసం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆదివాసి నాయకులు గుంటి రమేష్, సుంకరి మల్లేష్, ఓల్లాల మల్లేష్, గడ్డం లచ్చన్న, లక్కీ తిరుపతి, గుంటి బాపు, గుంటి నాగరాజు, యు.వై.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News