ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోనివిజ్ డమ్ ప్రీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా దాని కనుగుణంగా చక్కని వేషధారణతో, అలంకరించుకొని ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానోఅలరించాయి. సంస్కృతిసంప్రదాయాలకు అనుగుణంగా చిన్నారులు ధరించిన దుస్తులు, వేసిన ముగ్గులు చూపరులను ఎంతగానోఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అనేది ఆధ్యాత్మికత, కుటుంబం, సంస్కృతిని కలిపే గొప్ప పండుగని, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ముగ్గులు, భోగి మంటలు, డూడూ బసవన్నల సందడి, వాటి సంప్రదాయాలతో ఈ పండుగ కళకళలాడుతుందని, ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని, ఆత్మీయతను పెంపొందిస్తుందని వారు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫహీంసుల్తానా మాట్లాడుతూపంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు ఇది ఆనందాన్ని, సంపాదనను తెస్తుందని అందుకే అందరూ దీనిని పంటల పండుగ అని అంటారని పేర్కొన్నారు. చెడును విడిచిపెట్టి, మంచిని ఆహ్వానించడం, కొత్త శక్తితో ఉత్సాహంగా జీవించడం, దానధర్మాలు చేయడం, సంప్రదాయాలను పాటించడం ఈ పండుగ ముఖ్యాంశమని అకాడమిక్ చీఫ్ అడ్వైజర్ నాజియా ఇక్బాల్, ప్రీ స్కూల్ ఇన్చార్జి హారికలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరితా రాణి, దివ్య, మాధవి, రాధిక, స్వాతి, అఖిల, సౌజన్య, రవళి, సుజాత, రజనీ కుమారి, కళ్యాణి, శ్రీలత, భద్రయ్య లతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News