ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గ్రామాల్లో పారిశుధ్యం అందరి బాధ్యతని జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య అన్నారు. గురువారం మంథని మండలంలోని సురయ్యపల్లి, గద్దలపల్లి గ్రామపంచాయతీల్లో డిపివో పర్యటించారు. ఈ సందర్భంగా డిపివో ఆయా గ్రామాల్లోని మురికి కాలువలు, నర్సరీలు, సిగ్రిగ్రేషన్ షెడ్లను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీల రికార్డులను పరిశీలించి, వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజారెడ్డి, సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు, ఉప సర్పంచ్ పులి సూచిత వరుణ్ గౌడ్, గద్దలపల్లి సర్పంచ్ తోంబూరపు సుజాత తిరుపతి, ఆయా గ్రామాల వార్డ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Admin
E Nivas News