Wednesday, 29 July 2026 12:38:59 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

సర్పంచ్ లను సన్మానించిన ఎంపీ

Date : 03 January 2026 11:30 PM Views : 287

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాతాండూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుఎండి. ఈసా తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ శనివారం ఈసాని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈసా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తల్లి మృతి కుటుంబానికి తీరని లోటని కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చి, తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం తాండూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గెలుపొందిన సర్పంచులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూగ్రామ పాలనలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమ న్నారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ తెలిపారు. సర్పంచులు అంకితభావంతో పని చేస్తే ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయిఅధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: