ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అన్నా చెల్లెళ్లకు ప్రతీకైన రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన నివాసంలో మహిళా మంత్రులు కొండా సురేఖ,ధనసరి సీతక్కలు రాఖీ కట్టి వారి యొక్క సోదర భావాన్ని చాటి చెప్పారు. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో అనూ హ్య పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా పరకాల నియోజక వర్గ పంచాయితీ, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారంటూ జోరుగా సాగుతున్న ప్రచారాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, నివాసానికి కొండా సురేఖ వెళ్లారు. సీఎం నివాసానికి వెళ్లడం కొండ సురేఖ ఇదే తొలిసారి కావడం విశేషం. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కొండ సురేఖ సీతక్క,రాఖీ కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా రాజకీయ వాతావర ణం మారి పోయింది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కొండా కుటుంబానికి – సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పరకాల నియోజకవర్గం సీటు వ్యవహారం తీవ్ర విభే దాలకు దారితీసింది. కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, టార్గెట్గా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.ఈ పరిణా మాలపై అధిష్టానం సైతం అసంతృప్తి వ్యక్తం చేసిందని, సురేఖను మంత్రివ ర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ జోరు గా ఊహాగానాలు వెల్లువెత్తాయి. కొండా దంపతులు కాంగ్రెస్ను వీడి సొంత దారి చూసుకుంటారా? అన్న చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో రక్షాబం ధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకున్న కొండా సురేఖ రేవంత్ రెడ్డికి స్వయంగా రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం వీరిద్దరి మధ్య కొద్దిసేపు తాజా రాజకీయ పరిణామాలు, పరకాల సీటు వివాదంపై ఏకాంత చర్చలు జరిగినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం కొండ సురేఖ మీడియాతో మాట్లాడకుం డానే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు.
Admin
E Nivas News