Monday, 14 September 2026 07:14:13 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు గాయం...

Date : 13 January 2026 10:38 PM Views : 227

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నిషేధిత చైనా మాంజా వాడకం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వరస మాంజ ప్రమాదాలు వాహన దారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ఉదయం ఉప్పల్ లో చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం అయింది. దీంతో అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారంనగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాపాయాన్ని సృష్టించింది. సంక్రాంతి పండుగ వేళగాలిపటాలు ఎగరేసేందుకు వాడే ఈ ప్రమాదకరమైన దారం.. విధి నిర్వహణకు వెళ్తున్న ఒక పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుచైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఉప్పల్‌లోని తన నివాసం నుండి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరా రు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్దకు చేరుకోగానే గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఆయన గొంతుకు అకస్మాత్తుగా చుట్టుకుంది. వాహనం వేగంగా ఉండటంతో మాంజా గొంతులోకి బలంగా చొచ్చుకెళ్లింది. దీంతో ఆయన గొంతుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి పోలీసులు ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యు లు చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :