ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : టిజిపిఎస్సి విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన గంట మహేష్ గౌడ్ ను మంథని సీఐ రాజు మంగళవారం సన్మానించారు. మహేష్ ప్రస్తుతం సూపరింటెండింగ్ ఇంజినీర్ పెద్దపల్లి లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. ప్రిపరేషన్ సమయంలో మార్గదర్శిగా ఉన్న మహావాది సతీష్ కుమార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
Admin
E Nivas News