ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా మంథనిలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల బంద్ నిర్వహించి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద సరే రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఎన్ఎస్ యు ఐ నియోజకవర్గ ఇన్చార్జ్ కెక్కర్ల సందీప్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్ చుక్ అనే పర్యావరణ శాస్త్రవేత్త నిరాహార దీక్ష చేస్తుంటే తన దీక్షను భగ్నం చేసి హాస్పటల్ తరలించడం జరిగిందని అన్నారు నిరాహార దీక్షకు మద్దతుగా దేశంలోని విద్యార్థులు యువత తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మరియు యువతపై విచక్షణ రహితంగా పోలీసులు చేసిన దాడిని ఖండించారు. 22 లక్షల పై చిలుకు విద్యార్థులు నీట్ పరీక్ష రాసి వారి జీవితాలు అల్లకల్లోలం అవుతున్న కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకుండా ఉద్యమాలను అణిచివేయడం సిగ్గుచేటున్నారు. నీట్ పరీక్ష లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని ఎదవ చేశారు. 22 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని డిమాండ్ చేశారు. NTA వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని అని విద్యార్థులపై టి ఆర్ గ్యాస్ వాటర్ కెనాన్లు రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తూ అతి కిరాతకంగా ఉద్యమాన్ని అణిచివేయడాన్ని దారుణమైన చర్యన్నారు. యువకులు, విద్యార్థులు గత కొంతకాలం నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రధాని మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు యువకులు పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ నూకల కమల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మద్దతు తెలిపారు నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్, అఖిల్, మహేందర్ రణధీర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News