ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర శాఖ పులుపు మేరకు మంగళవారం సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కమాన్ పూర్ జూలపల్లి గ్రామాల మధ్య గల ప్రధాన రహదారి వెంకటేశ్వర సినిమా థియేటర్ నుండి దాసరి పల్లె వెళ్లే దారిలో మూల మలుపు వ్యవసాయ బావి వరకు ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. బిజెపి మండల శాఖ అధ్యక్షులు కొయ్యడ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రాము, సీనియర్ నాయకులు మట్ట శంకర్, జంగపల్లి అజయ్, మల్లారపు అరుణ్ కుమార్, పెద్దపల్లి శ్యాంసుందర్, బర్ల సదానందం, గట్టు శ్రీనివాస్, ఆసం శ్రీనివాస్, కాసు పవన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News