ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ యువరాజ్ మర్మత్ సూచించారు. "కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) యువరాజ్ మర్మత్ గురువారం ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో పర్యటించారు. ఆసిఫాబాద్ మండలంలోని బుర్గుడ, రెబ్బెన మండలంలోని తక్కలపల్లి గ్రామాల్లోని ప్రీ-ప్రైమరీ పాఠశాలలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలల ఆవరణలో చేపడుతున్న సుందరీకరణ, పెయింటింగ్ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News