ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నీటి పరీక్ష లీకేజీని నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం మంచిర్యాల ఎమ్మెల్యేకొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేపర్ లీక్ విషయంలో మోదీ ప్రభుత్వం అసమర్థత అన్నారు. అదేవిధంగా పేపర్ లీక్ చేసిన దొంగలను వెంటనే చట్ట శిక్షించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు , ఉప సర్పంచ్ లు , వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Admin
E Nivas News