ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సిపిఐ మంచిర్యాల జిల్లా ప్రచార బస్ జాత 4వ రోజు మంచిర్యాల జిల్లా జన్నారం కు చేరుకున్న సందర్భంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ప్రచార జాతను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ జనవరి 18న తేదీన ఖమ్మంలో నిర్వహించే సిపిఐ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు జోగుల మల్లయ్య జన్నారం మండల కార్యదర్శి దాసరి తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి కలేందర్, అలీ ఖాన్ జిల్లా సమితి సభ్యులు కొట్టే కిషన్ రావు,దొడ్డిపట్ల రవీందర్,దేవి పోచన్న చాడ మహేందర్ రెడ్డి, మామిడి విజయ్, బియ్యాల రాజేశం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News