Thursday, 30 July 2026 04:15:31 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్ వాసులకు మరో ఫ్లైఓవర్..

Date : 17 April 2026 10:28 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదు నగర అభి వృద్ధిలో మరో కీలక అడు గు పడింది,మహా నగర ప్రజలకు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం శాస్త్రి పురం ఫ్లై ఓవర్ రైల్వే బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవ ర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్ కూడా విప రీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య లను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్- ఫలక్‌నుమా- శివరాంపల్లిరైల్వే లైన్‌లోని లెవల్ క్రాసింగ్ నంబర్ 7 వద్ద ఈ భారీ ప్లైవోర్ నిర్మాణాన్ని చేపట్టింది. సుమారు రూ. 71 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు,16.60 మీటర్ల వెడల్పుతో రెండు వైపులా రెండేసి లేన్లతో ఈ ప్లైవోర్‌నునిర్మించారు. శాస్త్రిపురం రోడ్డులో ఉన్న ఈ ఫ్లైఓవర్ మైలార్‌దేవ్‌ పల్లిని ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోతో కలుపుతుం ది.ఈ ఫ్లైఓవర్ అందుబాటు లోకి రావడం వల్ల పాత బస్తీ, పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుం ది.దీంతో మైలార్‌దేవ్‌పల్లి – వట్టేపల్లి – ఫలక్‌నుమా మార్గంలో ప్రయాణ సమయం దాదాపు 30 నిమిషాలు తగ్గుతుంది. అలాగే గతంలో మాదిరి రైల్వే క్రాసింగ్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వాహనదారులకు విముక్తి లభిస్తుంది. దీంతో ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా వాహనదారులకు సాఫీగా రాకపోకలు సాగించవచ్చు. అంతేకాదు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ప్రయాణం సాఫీగా సాగడంతో పెట్రోల్ వినియోగం తగ్గడమే కాకుండా, వాయు, శబ్ధ కాలుష్యం కూడా తగ్గు తుంది. కాబట్టి ఈ ప్లైఓవర్ ఓల్డ్‌ సిటీ వాసులకు ఎంతో ఉపశమనాన్ని కలింగించ నుంది. అలాగే ఇది సమీప ప్రాంతాల ఆర్థిక ఆభివృద్ధికి కూడా తోల్పడుతుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :