ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కళ్యాణ లక్ష్మి పథకంతో టిఆర్ఎస్ ప్రభుత్వం సంచలనం సృష్టించిందని దీంతో పేద ఆడ బిడ్డలకు వరంగా మారిందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాభీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్దిదారులకు రూ. 1,00,116/- చొప్పున చెక్కులనుఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనతో జన్మించిన కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా నిలిచిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ ద్వారా కేసీఆర్ ప్రారంభించిన లక్షతో పాటు తుళం బంగారం అందజేసిన ఘనత కేసీఆర్ దన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ పెళ్లిరోజే చెక్కు అందిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా బిడ్డ పుట్టిన తర్వాత చెక్కు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News