Tuesday, 15 September 2026 01:31:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టరేట్లో వినతి పత్రం అందజేత

Date : 04 December 2025 12:57 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రిడియేషన్ తో సంబంధం లేకుండా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ డీజేఎఫ్ డబ్ల్యూ ఆధ్వర్యంలో బుధవారం పెద్దపెల్లి కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ డబ్ల్యూ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికలు, చానల్స్ లో రిపోర్టర్లుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా తమ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి కాలం వెళ్లదీసిందన్నారు. జర్నలిస్టు సమస్యల నిర్లక్ష్యానికి పర్యవసానం, మూల్యం బిఆర్ఎస్ పార్టీ చెల్లించుకుంది. ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అదే కోవలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని,ఇండ్ల స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్, జాతీయ పిఆర్ఓ మామిడి స్వామి, మహిళా అధ్యక్షురాలు వోడ్నాల లత, ప్రధాన కార్యదర్శి కన్నూరి జేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, రావుల రాజ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి మాదేశి శ్రావణ్ కుమార్ జర్నలిస్టులు మంథని లక్ష్మణ్, అసంపల్లి స్వామి, బంధాల రాజశేఖర్, బడికెల కృష్ణ, వోడ్నాల తిరుపతి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :