ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల మాజీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 24 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 1000 రోజులు దాటుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఉసురు కొట్టక తప్పదని పలువురు నాయకులు దుయ్యబట్టారు. అనంతరం జిల్లాలోని తహసిల్దార్ ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News