ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శ్రీరామనవమిని భద్రాచలంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం వేద పండితులు మంత్రం చారణల మధ్య కన్నుల పండవగ నిర్వహించారు.మిథిలా స్టేడియంలో శిల్ప కళాశోభిత కళ్యాణ వేదికపై సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ప్రభుత్వం తరఫున సీఎం రివర్ రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాదికి తరలివచ్చారు . దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ప్రతి ఏటా శ్రీరామనవమినగా జగద్రక్షకుడి కళ్యాణం అంగరాల అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్ట హాసంగా సాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలాభక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాములోరి కల్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తకోటి పెద్దఎత్తున తరలి వస్తున్నారు.సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి జన్మ సార్ధకం చేసుకున్నారు. నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ పండితులు ఎదుర్కోలు ఉత్సవంనిర్వహించారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో ఎదుర్కొ లు అత్యంత కీలకమైన ఘట్టం. పెళ్లికి ముందు సీతారాములను ఎదురెదురుగా ఉంచి, ఇరు పక్షాల వారు పసుపు, కుంకుమలు, తాంబూ లాలు మార్చుకుంటూ, భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. కల్యాణ వేదికైన మిథిలా ప్రాంగణాన్ని సీతమ్మ పుట్టినిల్లయిన మిథిలా నగరంగాపక్కనున్న వైకుంఠ క్షేత్రం రామయ్య వెలసిన ప్రాంతంగా భావిస్తారు. అలాగే అర్చకులు భగవంతుని వంశ క్రమాన్ని, గోత్ర నామాలను చదువుతూ పెళ్లికి ముందు వధూవరుల పక్షాన వాదోపవాదాలు చేసుకునే ఈ ఎదుర్కోలు ఘట్టం అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఇదిలావుంటే, శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం కు వచ్చిన సీఎం సీఎం రేవంత్రెడ్డి ఉదయం 11గంటలకు రామాలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.351కోట్లతో మొదటి విడత పనులకు శంకుస్థాపన గావించారు. ఇప్పటికే రామాలయ అభివృద్ధికి రూ.586కోట్ల తో బృహత్తర ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశ పనులను రూ.351కోట్లతో చేపట్టేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. శనివారం జరిగే శ్రీరామ పట్టేభిషేకానికి అన్ని రకాల ఏర్పాటు చేశారు.
Admin
E Nivas News