ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా స్ఫూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతపల్లి నందు శనివారం క్రీడా దుస్తులు 25 మంది విద్యార్థుల కు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోత్ శంకర్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం,మనమే కాకుండా మనతో పాటు మన వారిని అందరూ పైకి తీసుకురావాలని కోరారు .స్ఫూర్తి ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.స్ఫూర్తి ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామసహాయం శ్రీధర్ రెడ్డి ,మాట్లాడుతూ విద్యార్థుల ను క్రీడలలో ప్రోత్సాహించాలని ఉద్దేశంతో క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద నిరుపేద విద్యార్థులకు సహకారం అందించుటకు సంస్థ పని చేస్తుంది అన్నారు చదివే పిల్లలకు బుధవారము, శనివారము వేసుకునే విధంగా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలొ చదివే విద్యార్థుల కు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమములో స్ఫూర్తి ఎడ్యుకేషన్ ప్రధానకార్యదర్శి మేకల కృష్ణయ్య, ఉపాధ్యాయులు నాగరాణి, సత్తార్, వజ్ర కుమారి, రవీందర్, జ్యోతి, మాధవ్, ప్రదీప్ కుమార్, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News