Wednesday, 29 July 2026 08:11:38 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 31 March 2026 10:37 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. 2 వీలర్ ను 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 1 లక్ష రూపాయలతో 180 యూనిట్లు, ఈ. వి. త్రిచక్ర వాహనం (సరుకు రవాణా,ప్రయాణికుల రవాణా) ను 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయలతో 89 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం ను 100 శాతం కార్పొరేషన్ రాయితీ కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు 19 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. పశు సంవర్ధక పథకాలలో 70 శాతం కార్పొరేషన్ రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 2 లక్షల 40 వేల రూపాయలతో 96 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాలలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, టామ్ కామ్, ప్రధానమంత్రి అజయ్ పథకాల క్రింద జాతీయస్థాయి శిక్షణ సంస్థల ద్వారా వేతన ఉపాధి కొరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత), ఆదాయ ధ్రువీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు లోబడి), వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయసు 21-50 సం.లు, వ్యవసాయ పథకాలకు 21-60 సం.లు ఉండాలని తెలిపారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు), షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు,గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంపు సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి అవసరం), బోరు బావి, నీటి లభ్యతను నిర్ధారిస్తూ గ్రామ కార్యదర్శి నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగుల కొరకు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలని తెలిపారు. పాడి పశువుల పథకం కొరకు పశుగ్రాసం పెంచడానికి కనీసం 10 గుంటల సాగునీటి సౌకర్యం ఉన్న సొంత/కౌలు భూమి కలిగిన షెడ్యూల్డ్ కులములలబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ లోగా ఓబి ఎంఎంఎస్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని సరైన ధ్రువపత్రాలు జత చేసి సంబంధిత మండలం/మున్సిపాలిటీ కార్యాలయాలలో సమర్పించాలని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :