ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 7 8 9 తేదీలలో జరిగే సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా హజిపూర్ మండలం గుడిపేట బేవరేజాస్ గోదాం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో డిసెంబర్ 7,8,9 వ తేదీలలో జరుగుతున్న సీఐటయు రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూకార్మికుల సమస్యల పరిష్కరమే ద్యేయంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సీఐటీయూ. కేంద్రంలో నరేంద్రమోడీ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరించడం చాలా దారుణం. బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, హక్కులను రద్దు చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విదంగా ఈ చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు అమలు జరిపి కార్మికులను బానిసలుగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వానికి అధిక ఆదాయం తీసుకొచ్చే హమాలీ కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం వేట్టి చాకిరీ చేయించుకుంటూ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. కనీస వేతనాలు చెల్లించాలి. అర్హులైన నిరుపేద కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలను, భవిష్యత్తు కార్యచరణను ఈ రాష్ట్ర మహాసభలలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 7వ తేదీన మెదక్ పట్టణంలో జరిగే ర్యాలీ ప్రదర్శన, బహిరంగ సభలో అధిక సంఖ్యలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, హమాలీ యూనియన్ అధ్యక్షులు , కోశాధికారి మహేందర్, ఉపాధ్యక్షులు మిట్ట మల్లేష్, సహాయ కార్యదర్శులు బి. సుధాకర్, మేస్రి శంకర్, సభ్యులు దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News