ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఏఐసీసీ ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పటివరకు మంత్రి పదవులు రాని ఆశావాహులైన మంత్రి పదవి దక్కుతుందేమోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Admin
E Nivas News