ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందడం కాస్తంత బాధ కలిగించినా..గాని .రాజకీయాల్లో .గెలుపోటములు సహజమని ఓటమికి తలవంచేది లేదు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతు కోరుతూ మేమంతా అధికార పార్టీ ప్రతినిధులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సహకారంతో వార్డుల్లో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని వారికి అందుబాటులో ఉండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకునికి గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా ప్రజా హృదయాలను గెలుచుకోవడానికి ఈ నాలుగు వార్డుల నాయకులం కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పథకాలతో అమలు పారదర్శకంగా జరిగేలా మా వంతు సహాయం ఉంటుంది అన్నారు, *ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు* 10, 11 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు మేమే చేయిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కొబ్బరికాయలు కొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇప్పటివరకు మొదటి కౌన్సిల్ సమావేశం జరగకుండానే. సదరు వార్డు కౌన్సిలర్లు ఏ విధంగా ఆ పనులను తీసుకువచ్చారో అందుకు ఏ విధమైన కృషి చేశారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అజీజ్ పాషా, కుడితి నరసింహారెడ్డి.ఎండి అప్సర్. బానోత్ బాల్యా నాయక్. చిన్నా నాయక్.షేక్ అఫ్జల్, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, భాషిపంగు రామస్వామి, బాషిపంగు రవికాంత్, సైదులు, ఉపేందర్ ,లెజెండ్ పరశురాములు, ఆటో రాములు, చేన్నబోయిన సాయి, వెంకన్న, చంద్రయ్య.మహేందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News