ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యరంగంలో మరో విశేష రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలో 24 ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆసుపత్రి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ అరుదైన ఘనతకు కేంద్రబిందువైన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్. కృష్ణవేణి, తన వైద్య నైపుణ్యంతో, కృషితో, 11 నార్మల్, 13 సర్జరీలు అంకితభావంతో ఆపరేషన్ చేయడంతో తల్లులు శిశువులను సురక్షితంగా ప్రసవాలు చేశారు. ఆమెతో పాటు పనిచేసిన నర్సింగ్ స్టాఫ్, సహాయ వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమించి తమ వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరగడం జిల్లాలోనే మొదటిసారి. ప్రతి కేసును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉండేలా డాక్టర్ కృష్ణవేణి బృందం కృషి చేశారు. ఈ విజయంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు డాక్టర్ కృష్ణవేణి, ఆమె బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రి చూపుతున్న అంకితభావం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Admin
E Nivas News