ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిందని పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో దాదాపు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం గర్వకారణంఅన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు అని తెలిపారు. అలాగే వివిధ కంపెనీలు సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి జాబ్ మేళాలను సింగరేణి యాజమాన్యం సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహిస్తే, మరెంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల నేను దేశం తరఫున యుఎన్ఓ సమావేశంలో దేశ ప్రతినిధిగా పాల్గొని, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు నిరుద్యోగ సమస్యపై వివరంగా మాట్లాడానన్నారు. మన రాష్ట్రంలో ఉన్న నైపుణ్యం గల యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటగల సామర్థ్యం కలిగివున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి డైరెక్టర్ పి పి వెంకటేశ్వర్లు,మందమర్రి సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News