Saturday, 13 June 2026 01:16:43 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో 50వేల ఉద్యోగాలు ఇచ్చింది

ఎంపీ గడ్డం వంశి

Date : 27 October 2025 07:23 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిందని పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో దాదాపు 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం గర్వకారణంఅన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన జాబ్ మేళాలో 3,000 మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు అని తెలిపారు. అలాగే వివిధ కంపెనీలు సుమారు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇలాంటి జాబ్ మేళాలను సింగరేణి యాజమాన్యం సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రాంతాలలో కూడా నిర్వహిస్తే, మరెంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల నేను దేశం తరఫున యుఎన్ఓ సమావేశంలో దేశ ప్రతినిధిగా పాల్గొని, దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు నిరుద్యోగ సమస్యపై వివరంగా మాట్లాడానన్నారు. మన రాష్ట్రంలో ఉన్న నైపుణ్యం గల యువత ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటగల సామర్థ్యం కలిగివున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి డైరెక్టర్ పి పి వెంకటేశ్వర్లు,మందమర్రి సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :