Saturday, 13 June 2026 12:08:36 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఉపాధి హామీ పథకంలో కొత్త చట్టంజూలై 1 నుంచి అమలు....

Date : 25 May 2026 09:15 AM Views : 49

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర ప్రభుత్వం దేశ గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది దశాబ్దాలుగా అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో, కొత్త చట్టాన్ని తీసుకువచ్చిం ది, కొత్తగా తీసుకువ చ్చిన వికసిత్‌ భారత్‌- గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీ వికమిషన్‌ గ్రామీణ, వీబీ-జీరామ్‌ జీచట్టం- 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ చట్టం అమలు ఎలా పనుల పర్య వేక్షణ బాధ్యత ఎవరిది, పథకానికి ఎవరు అర్హులు, పని దినాలెన్ని, వేతనాల చెల్లింపులు ఎలా, రాష్ట్ర ప్రభుత్వాల విధులేంటిఅన్న అంశాలను అందులో పేర్కొంది. లబ్ధిదారులు ఉపాధి హామీ చట్టం నుంచి వీబీ-జీరామ్‌జీ చట్టానికి మారే ప్రక్రి యను వివరించింది. ఈ చట్టం దేశవ్యాప్తం గా జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ముసా యిదా నిబంధనలపై అభ్యంతరాలుంటే జూన్‌ 21లోగా తెలియజేయాలని రాష్ట్రాలను, నిపుణుల ను, సంస్థలను, ప్రజా సంఘాలను కోరింది. ముసాయిదాలో పేర్కొన్న దాని ప్రకారం వీబీ- జీరామ్‌జీ చట్టం అమలుకు కేంద్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో కేంద్రగ్రామీ ణాభివృద్ధి శాఖ, నీతి ఆయోగ్‌ నుంచి ప్రతి నిధులు, కేంద్రమంత్రు లు, రాష్ట్రాల ప్రతినిధు లు సభ్యులుగా ఉంటా రు. ఇక, కేంద్రస్థాయి లోనే సెంట్రల్‌ గ్రామీణ్‌ రోజ్‌గార్‌ గ్యారంటీ కౌన్సిల్‌ పనులను పర్యవేక్షిస్తుంది. చట్టం అమలును చేస్తుంది. ఈ చట్టంలో ఒక కూలీకి ఏడాదిలో కల్పించాల్సిన పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచారు. కూలీలు కోరిన 15రోజుల్లోగా పని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే, వారికి భృతిని చెల్లిం చాలి. పని కల్పించడం ఆలస్యమైన మొదటి 30రోజుల్లో రోజువారీ గా కనీసం పావు వంతు వేతనం చెల్లించాలి. తర్వాత కూడా పని కల్పించక పోతే సగం వేతనాన్ని చెల్లించాలని ముసా యిదా నిబంధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేవైసీ చేసుకున్న వారందరినీ కొత్త చట్టం కింద గుర్తిస్తారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :