ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దీక్షా దివస్ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న తో కలిసి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఫోటో గ్యాలరీని వీక్షించి అనంతరం వారు చేసిన త్యాగాలను మరియు రాష్ట్రం సాధించిన తర్వాత ప్రగతిని నాయకులతో కలిసి వీక్షించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేసి నేటికి 16 ఏండ్లు గడిచాయని అన్నారు. కేసీఆర్ చేసిన ప్రాణ త్యాగ ప్రయత్నం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి, ప్రగతి సాధించిందన్నారు. టి బీజేపీ, టి కాంగ్రెస్ లకు పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష అని అన్నారు. కేసీఆర్ ఆనాడు ఉద్యమం ప్రారభించకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులను ఎవరైనా గుర్తుపట్టేవారా అని అన్నారు. 2001 లో కేసీఆర్ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆనాడు డిగ్రీ విద్యార్థిగా నెరడిగొండ లో కేసీఆర్ చేతుల మీదుగా జెండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News