ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం శాఖ అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఆయన దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యం లో డీజీపీ సీవీ ఆనం ద్, ఇతర పోలీస్ ఉన్నతాధి కారులతో సీఎం అత్య వసర సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం 7,437 పోస్టుల కోసం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా నిర్వ హించాలని అధికారు లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ప్రింటింగ్, ట్రాన్స్పోర్ట్తో పాటు అన్ని దశల్లో చాలా అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. నియమ నిబంధన లను అనుసరించి లోపాలు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల సెక్యూ రిటీపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిం చారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్ర చారం జరగకుండా కట్టడి చేయాలనిసూచించారు. పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమా యకపు నిరుద్యోగు లను మోసం చేసే దళారులు, ఫేక్ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కోచింగ్ సెంటర్లపై నిరంతరం ప్రత్యేక నిఘా పెట్టాలని, అన్నారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్, పోలీస్ నియామక మండలి బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News