ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మంథనిలోని శ్రీ షిరిడి సాయి ఆలయంలో బుధవారం ఉదయం 6 గంటలకు మన ఇంటి హారతి కార్యక్రమము ఏర్పాటు చేశారు. హారతి కార్యక్రమానికి ఆడపడుచులు తమ ఇంటి నుండి మంగళహారతి, పూలు, అగరొత్తులు, హారతి కర్పూరం, కొబ్బరి కాయ, పండ్లు, విడిపూలు తీసుకురావాలని ఆయన కోరారు. ఉదయం 6 నుండి 6-30 వరకు సామూహిక శ్రీసాయి హారతి నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ తెలిపారు. హారతి అనంతరం ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా హారతి ఎవరి ఇంటికి వారు తీసుకు వేళ్ళాలన్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించడం మన సాంప్రదాయమని, అందులో భాగంగానే మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Admin
E Nivas News