Sunday, 13 September 2026 03:30:47 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 21 August 2026 08:14 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యా సంస్థలలోవిద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం ద్వారక గ్రామంలో కొనసాగుతున్న ఎస్.టి. బాలుర వసతి భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలోవిద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఎస్.టి. వసతి గృహ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించివిద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకొని, కళాశాలలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనుమలిస్ వారికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఓ.పి. రిజిస్టర్, వార్డు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించిఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న గర్భిణుల ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు విధులలోఅందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులలో సాధారణంగా నమోదు అయ్యే వ్యాధుల వివరాలను తెలుసుకొని వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనకల్పించాలని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి, పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వంటశాల, భోజన శాల, వసతి గదులను పరిశీలించివిద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.అనంతరం జన్నారం మండలం కిష్టాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిపాఠశాలల విద్యార్థులకుఅందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన ఇతర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓ.పి. రిజిస్టర్, వార్డు, మందుల లభ్యత, వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల హాజరు, అందుబాటులో ఉన్న వైద్య సేవలపై వివరాలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల తహసిల్దార్ తో మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనుమలిస్ వారికి నిబంధనల ప్రకారం నోటీసుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధితఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: