ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండవ విడత భారీ మెజారిటీ సాధించి గెలుపొందిన పట్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పంద్రం సుగుణ కరాత్వడా సర్పంచ్ దుర్వ విశ్వశ్వర్ రావ్, బాబేర సర్పంచ్ రాథోడ్ పద్మ రవి లను మంగళవారం బోథ్ మండల కేంద్రంలోమాజీ జడ్పిటీసి డాక్టర్ సంధ్యారాణి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మాజీ జడ్పిటీసి మాట్లాడుతూ గ్రామాలలో పని చేసి ప్రజల మద్దతు ఉండే నాయకులకు ఎల్లప్పుడూ ప్రజలు అండగా ఉండి విజయాన్ని అందిస్తూ ఉంటారని గెలుపొందిన సర్పంచ్ లు గ్రామాలలో బాధ్యతయూతంగా పని చేయాలనీ తెలిపారు. ఈకార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్, న్యాయవాది పంద్రం శంకర్,కరత్వాడ ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ తోడషం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News