Sunday, 13 September 2026 01:43:37 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

ఎంపీ.గడ్డం వంశీకృష్ణ

Date : 21 November 2025 07:42 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని వెంకటేశ్వర కాటన్ మిల్లు లో సి సి ఐ ద్వారా చేపట్టిన పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఇందులో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎకరానికి 14 నుండి 16 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వ నిబంధనలలో పేర్కొన్న 7 క్వింటాళ్ల అంశాన్ని సడలించి రైతులు ముందుగా నమోదు చేసుకున్న ప్రకారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సి.ఎం.డి. తో మాట్లాడి ఎల్ 1, ఎల్2, ఎల్3 అంశాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో కేటాయించిన 10 కొనుగోలు కేంద్రాలలో 6 కేంద్రాలు ప్రారంభించబడి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, రైతుల సౌకర్యార్థం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలనితెలిపారు. సంవత్సరం క్వింటాల్ పత్తికి 8 వేల 110 రూపాయలుగా మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా అవాస్తవ ప్రచారాన్ని మానుకొని రైతు సంక్షేమం కోసం కలిసి రావాలన్నారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా 7 క్వింటాళ్ల అంశాన్ని పరిశీలించి రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అధిక దిగుబడి సాధించిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసి ధ్రువీకరించుకోవాలని, పంట ఉత్పత్తి ఆధారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ప్రాంతాలలో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, జైపూర్ ప్రాంతంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు లబ్ధి చేకూరేలా పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని, కౌలు రైతులు తమ పట్టాదారుల సమన్వయంతో వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ధృవపత్రాలు జారీ చేసే సమయంలో అధికారులు జాగ్రత్త వహించాలని, వివరాలు సక్రమంగా ఉన్నట్లయితే టి ఆర్ జారీచేసి పత్తి కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి కొనుగోలు కేంద్రాలకు నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని తీసుకువచ్చే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం ఎంపీ అనుచరుడు దమ్మ సునీల్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అంతకుముందు హన్మంతు పల్లి, చందారం కు బస్ సౌకర్యం కల్పించడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలని నాయకుడు మల్లేష్ కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల కిషన్ గౌడ్, మల్లేష్, దొంత నర్సయ్య, మినుముల శాంతి కుమార్, నారాయణ, కొనుగోలు కేంద్రం నిర్వహకులు, పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: