Monday, 14 September 2026 12:24:39 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మెడికో విద్యార్థులకు ఘన సన్మానం..

Date : 20 March 2026 07:08 PM Views : 220

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ జిల్లా నర్సంపేట విస్ డం ఉన్నత పాఠశాలలో 2022-2023 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు 2025 నీట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఎంబిబిఎస్ లో సీట్లు సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. శరదృతి ఉత్తమ ర్యాంకును సాధించి కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో, ముత్తినేని అంకిత ఆదిలాబాద్ లోని రిమ్స్ కాలేజీలో ప్రవేశాలు పొందినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మెడికో విద్యార్థినిలను ఘనంగా సన్మానించారు. అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశ నుండే క్రమశిక్షణను కలిగి తల్లిదండ్రుల పట్ల అభిమానం, ఉపాధ్యాయుల పట్ల గౌరవం తో విద్యను ఆర్జించినప్పుడే అనుకున్న ఫలితాలు సాధిస్తారని, దీనికి నిదర్శనమే మా ఈ విద్యార్థుల ఫలితాలని తెలుపుతూ ఎంబిబిఎస్ లో ప్రవేశాలు పొందిన విద్యార్థులను అభినందించారు. చాలినంత సన్నాహం పైనే విజయం ఆధారపడి ఉంటుందని అది లేనట్లయితే అపజయం తద్యమని పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ తో తమ కన్న తల్లిదండ్రుల, గురువుల మాటలు వింటూ తమ ప్రతిభను సానబెట్టుకుంటూ, క్రమక్రమంగా అభివృద్ధి చెందాలని తద్వారా తాము కోరుకున్న రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మెడికో విద్యార్థిని శరదృతి మాట్లాడుతూ నర్సరీ నుండి 10వ తరగతి వరకు తాను ఈ పాఠశాలలోనే చదువుకున్నానని తనకోసం అనునిత్యం పాటుపడిన తల్లిదండ్రులకు, వెన్నంటి ఉండి ప్రోత్సహించిన గురువులకు సదా రుణపడి ఉంటానని, వైద్య వృత్తిలో రాణించి పేదవారికి సేవ చేస్తానని తెలియజేశారు. మరో మెడికో అంకిత మాట్లాడుతూ ఏకాగ్రతతో చదివితే ఫలితాలు వాటంతటవే వస్తాయని, విద్యార్థులు మొబైల్ ఫోన్ లకు, టీవీలకు దూరమై పుస్తకాల వైపు మన మనసును కేంద్రీకరించినప్పుడే అనుకున్న గమ్యం సాధిస్తారని, తన విజయ రహస్యం ఇదేనని పేర్కొన్నారు. విద్యార్థులతల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ, సక్రమ మార్గంలో పయణిస్తూ తమ కన్న తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, తమ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్, డైరెక్టర్ జావేద్, అకాడమిక్ ఇన్చార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా, ఇన్చార్జి హారిక, మెడికో విద్యార్థినిలు శరదృతి, హారిక, అంకిత, తల్లిదండ్రులు భీమ్ సింగ్, సోమేశ్వర్, ఉపాధ్యాయులు వీరభద్రయ్య, రాము, ఇలియాస్, శివరాజ్, కుమార్, రఘుపతి రెడ్డి, ఎల్ రవీందర్, బి రవీందర్, సుమన్, మధు, మంజుల, శ్రీలత, ఆదిత్య లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :