ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీస్ అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో లక్షేట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ ర్యాలీ పట్టణంలోని గాంధీ చౌక్ లో ప్రారంభమై ఉత్కూర్ చౌరస్తా వరకు సాగింది. అనంతరం ఎస్సై గోపతి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక సంస్వరణ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లక్షెటిపేటలో నేడు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల ఆత్మ శాంతి కలగాలని ఎసై కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News