ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు దిశ త్రైమాసిక సమావేశం నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలను హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీ రూపంలో ఈ నెల 31 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలతో సకాలంలో తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు.
Admin
E Nivas News