Wednesday, 17 June 2026 02:33:42 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం...

సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Date : 16 June 2026 09:31 PM Views : 18

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వృద్ధాప్యంలో ఉన్న సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా 30 లక్షలు సహజవనం 10 లక్షల రూపాయలు బీమా కల్పించినందుకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ 130 సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అతి తక్కువ కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్న యావత్ సింగరేణిలోని 70 సంవత్సరాల లోపు విశ్రాంత ఉద్యోగులకు (కోల్ మైన్స్ పెన్షనర్లకు) రూ. 30 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని, అలాగే సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల వరకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూతమ సంఘం చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే నేడు విశ్రాంత ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తంలో బీమా సౌకర్యం లభించిందని కొనియాడారు. ప్రమాదవశాత్తు ఏ విశ్రాంత ఉద్యోగి అయినా మరణిస్తే, వారి కుటుంబానికి ఈ బీమా ఎంతో ఆసరాను, భరోసాను కల్పిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బీమా సౌకర్యం కల్పించడంలో సింగరేణి యాజమాన్యానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకు యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రాళ్ళబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పుప్పిరెడ్డి రాంరెడ్డి, మేడ రాజలింగు, బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ కార్యదర్శి కాటం లక్ష్మణ్, అవదూత శంకరయ్య, సలహాదారులు సత్యనారాయణ రావు, అంజన్న, దేవులపల్లి రామస్వామి, గజెల్లి సుదర్శన్, నాయకులు ఎండీ హుస్సేన్, ఎం.ఎస్. అలీ బేగ్, గురువయ్య, సంగెం రాంచందర్, కొత్తపల్లి రాంబ్రహ్మం, పి. రాజు, మామిడిపల్లి అంజయ్య నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :