ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను యథేచ్ఛగా వినియోగిస్తున్న హోటల్స్ లో అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మంథని మున్సిపాలిటీలో గృహ అవసరాలకు వినియోగించాల్సిన వంటగ్యాస్ పక్కదారి పడుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సురేష్ ఆరోపించారు. సొర చేపను వదిలి చిన్న చేపను పట్టినట్లుగా పెద్ద హోటల్లను వదిలి చిన్న హోటల్స్ పై తనిఖీలు నిర్వహించారన్నారు. మంథనిలోని ఓ హోటల్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వాడకం కనబడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిష్పక్షపాతంగా అన్ని హోటల్స్ పైన తనిఖీలు నిర్వహించి పేదలకు అందె సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
Admin
E Nivas News