ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్( రంజాన్) వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే ఈద్గాలకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికి ఒకరు అలై బలై చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీనియర్ ముస్లిం సోదరుల నివాసాలకు వెళ్లి, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం నింపాలని, సమాజంలో ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.
ఈ గల వద్ద ఎలాంటి ఆవంచ నీరసంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News