ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బిజెపికి బుద్ధి చెప్పుతెనే బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని, బిజెపిని బోన్లో నిలబెట్టే విధంగా బీసీ ఉద్యమం జరపాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎం కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ ను ఆమోదించాలని బిజెపి ప్రతినిధులు ఎందుకు పోరాటం చెయ్యడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోరాటం కేంద్రంలో అడ్డుకోవడం ఇది బీజేపీ కుట్రలో భాగమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకు వెళ్ళాలి.కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలోచిత్త చిత్తశుద్ది నిరుపించు కోవాలన్నారు. 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కి ఉంటే రాష్ట్రంలోని బీజేపీ కి చెందిన 8 ఎంపీ లు,ఇద్దరు కేంద్ర మంత్రులు,8 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామలు చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొడేంకి చందు సీపీఎం చెన్నూర్ మండల కార్యదర్శి, దాసరి రాజేశ్వరి సీపీఎం జిల్లా సీనియర్ నాయకురాలు. సామల ఉమ రాణి,కరీంభి,సిడం సమ్మక్క,తుమ్మ రేణుక, రాతిపల్లి నగేష్, కె.చంద్రన్న, బండారి రాజేశ్వరి, పాయిరాల రాములు, ఎం .బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News