ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మరిపెడ పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్ సూచనలతో నిరంతరం పనిచేస్తామని మరిపెడ పట్టణ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ పట్టణంలోని ఒకటి, రెండవ వార్డులలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా పర్యటించి పారిశుద్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సైడ్ డ్రైనేజీల నిర్వహణ, విద్యుత్ స్తంభాల సమస్యలను గుర్తించి, పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.ప్రజలు లేవనేత్తిన సమస్యలను అతి తొందరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డులోని శిదిలావస్థ అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. వేసవి రానుండటంతో వార్డులో నెలకొన్న తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు జాటోతు సురేష్, మెరుగు రాము, నీలా లచ్చిరామ్, తిరుపతి, కాంతమ్మ కరణ్ సింగ్, రమేష్, నాయకులు రాంబాబు, నెహ్రూ, భానియా, రవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News