Tuesday, 15 September 2026 06:12:28 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అంధ పాఠశాల విద్యార్థులకు విజ్ డమ్ హై స్కూల్

విద్యార్థుల 1లక్ష 13 వేల రూపాయల విరాళం..

Date : 23 February 2026 06:39 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులోని సోచ్ ఫౌండేషన్ వారి ఇట్రాడో అంధుల పాఠశాలకు వరంగల్ జిల్లా నర్సంపేట విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు 1లక్ష 13 వేలవిరాళాన్ని అందజేసినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోచ్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ తాము గుడ్డి వారిని ఆదరిస్తూ తమ పాఠశాలలో వారికి బ్రెయిలీలిపి తో పాటు, క్రీడలు, సంగీతం, నాట్య కళల్లో శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించడం గర్హనీయం. సమాజంలో పుట్టు గుడ్డి వారు నిరాదరణకు గురవడం మనకు తెలిసిందే. కానీ వారిని మేము అక్కున చేర్చుకుని వారిలోని నైపుణ్యతను గుర్తించి వారికి తర్ఫీదును ఇస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం దేవుడిచ్చిన అందమైన కళ్ళు గలవారు ముఖ్యంగా విద్యార్థులు చూపును కోల్పోవడం బాధ కలిగిస్తుందని వారు ఆవేదనను వెలుబుచ్చారు. దీనికి కారణం తల్లిదండ్రులు తమ ఐదుసంవత్సరాల లోపు చిన్నారులకు భోజనం చేస్తున్న సమయంలో ఏడవకుండా మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఇవ్వడమే ప్రధాన కారణంగా తెలియజేశారు. తర్వాత 6 నుండి 15 సంవత్సరాలలోపు విద్యార్థులు ఆటపాటల్లో కాకుండా ఫోన్లతో కాలక్షేపం చేయడం, వాటిలో క్రీడలు తదితర విషయాలను అధికంగా చూడడం ప్రధాన కారణంగా తెలియజేశారు. ఫోన్ లను, టీవీలను పిల్లలు అధికంగా చూడడం వలన కంటిలోని రెటీనా క్షీణించి, కంటి నరాలు పాడయిపోయి శాశ్వతంగా చూపు కోల్పోతుందని తెలిపారు. బంగారు భవిష్యత్తు గల ఇలాంటి పిల్లలు తమ అంధ పాఠశాలలో చేరడం బాధ కలిగిస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు పిల్లలకు తెలియజేయాల్సిన తల్లిదండ్రులు సైతం మొబైల్ ఫోన్లతో గడపడం బాధాకరమని అన్నారు. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచాలని, వారితో స్నేహం చేస్తూ ఫోన్, టీవీ తదితర వాటిని అధికంగా చూడడం వలన జరుగు నష్టాలను చెప్పాలని, తద్వారా మన అందమైన కళ్ళను కాపాడుకోవచ్చని, కళ్ళు లేనిదే ఈ అందమైన సృష్టిని మనం వీక్షించలేమని, తమ తల్లిదండ్రులను సైతం కళ్ళతో చూడలేరని తమ తమ పిల్లలకు విడమరిచి చెప్పాలని అన్నారు. భగవంతుడు కల్పించిన చూపును కాపాడుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ లను అత్యధికంగా వాడడం వల్ల రేడియేషన్ తో మెదడులోని నరాలు క్షీణించి, మెదడు మొద్దు బారిపోయి అనేకమంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని వారు తెలియజేశారు. తమ పాఠశాలకు విజ్ డమ్ విద్యార్థులు 1 లక్ష 13 వేలవిరాళాన్ని సేకరించి అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాఠశాల విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, సేవా గుణం లో సైతం ముందు ఉండడం గర్హనీయమని వారు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం మా అంధ పాఠశాలకు విరాళాలు అందిస్తూ మీలాంటి వారికి మేమున్నామనే భరోసాను కల్పించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఆ భగవంతుడు పిల్లలకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బంగారు భవిష్యత్తునిస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కల్పించాలని ఇట్రాడో పాఠశాల విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తాన, వీరభద్రయ్య, హారిక, ప్రశాంత్ కుమార్, రియాజ్, రాజేష్, పృద్వి, అరుణ, యాస్మిన్ లతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: