Tuesday, 28 July 2026 06:19:50 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కొరకు దరఖాస్తుల స్వీకరణ...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:20 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద 1, 5 తరగతులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారంఒక ప్రకటనలో తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ లో 1వ తరగతికి 91 సీట్లు, రెసిడెన్షియల్ లో 5వ తరగతికి 92 సీట్లు కేటాయించడం జరిగిందని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుండి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రూమ్ నం.3 లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందించాలని, దరఖాస్తు ఫారములు కార్యాలయ పని వేళలను పొందవచ్చని తెలిపారు. కుటుంబంలో ఒక అభ్యర్థికి మాత్రమే పథకం వర్తిస్తుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ బోర్డ్, మీ సేవ ద్వారా జారీ చేయబడినది), 1వ తరగతి విద్యార్థులు జూన్ 1,  2020 నుండి మే 31, 2021 మధ్య, 5వ తరగతి విద్యార్థులు 4వ తరగతి బోనఫైడ్, రేషన్ కార్డు,ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలని, మీ సేవ ద్వారా జారీ చేయబడిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, 3 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు, పాఠశాల నుండి గత సంవత్సరం మార్కుల జాబితా నకలు ప్రతులు (5వ తరగతి వారికి), అన్ని నకలు ప్రతులపై గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ సంతకం చేయించి సకాలంలో సమర్పించాలని తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల అభ్యర్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: