ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం డిపార్టుమెంటల్ వాలీబాల్ పోటీలు డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. మందమర్రి ఏఐటియుసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాధుని సుదర్శన్, క్రీడల హానరబుల్ సెక్రటరీ కార్తీక్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి, కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని పెంచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమర్రి స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కెప్టెన్ శాఖ శ్రీనివాస్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News