Thursday, 15 January 2026 05:42:32 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

దుబ్బాక మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.వివేక్

Date : 13 January 2026 10:43 PM Views : 31

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మెన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం, సన్మాన కార్యక్రమంలో మంగళవారం కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మెన్, సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డులలో టీఐఎఫ్‌డీసీ నిధుల ద్వారా రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి టీఐఎఫ్‌డీసీ ద్వారా రూ.10 కోట్ల నిధులు కేటాయించిందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీఐఎఫ్‌డీసీ నిధులు ఉన్నాయని అబద్ధాలు చెబుతూ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. మహిళా రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రూ.2 లక్షల రుణ మాఫీ అందని వారి వివరాలను లిస్టు ఇవ్వాలని సూచించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యారంటీ కార్డులు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :