ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న లబ్ధిదా రులకు రేవంత్ రెడ్డి, ప్రభుత్వంశుభవార్త చెప్పింది. దసరా పండుగ కానుకగా అర్హులైన పేదలకు కొత్త పింఛన్ల ను అందించేందుకు రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులోగా క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల కొత్త పింఛన్లను మం జూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి నేరుగా అధికారుల బృందం వెళ్లనుంది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి, నిజమైన అర్హతలను పరిశీలిం చి తుది జాబితాను సిద్ధం చేయనున్నా రు. ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అర్హత సాధించిన లబ్ధిదారులకు దసరా పండుగ నుంచి పింఛన్ సొమ్మును అందించడానికి ప్రభుత్వం సర్వసన్న ద్ధమైంది. దీనికోసం అవసరమైన బడ్జెట్ ను కూడా ఇప్పటికే కేటాయించారు. దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా బాధితు లు, చేనేత అలాగే గీత కార్మికులు, వితం తువులు, ఒంటరి మహిళల దరఖాస్తు లను ప్రాధాన్యత వారీగా పరిశీలిస్తు న్నారు. వితంతు పింఛన్ల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు కోర్టు ఉత్తర్వులు లేదా ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్న ట్లు రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని వర్గాలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతు న్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సర్టిఫికెట్లు లేకపోయి నా దరఖాస్తు చేసు కునే వెసులుబాటు కల్పించారు.
Admin
E Nivas News