ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎఫ్ ఏ సీ గా ఉష గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన సయ్యద్ సలీం బుధవారం పదవి విరమణ పొందడంతో బాలుర కళాశాల ప్రిన్సిపాల్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఉషా మాట్లాడుతూ అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం అధ్యాపకులు, సిబ్బంది ప్రిన్సిపల్ ఉషను శాలువాతో ఘనంగా సన్మానించారు.
Admin
E Nivas News